హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీకి కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సా హం ఉప్పొంగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పుట్టినరోజు నాటికి కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండొచ్చని చెప్పా రు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరినీ కేసీఆర్ కలిశారని చెప్పా రు.
ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించిందని.. త్వరలో అసెంబ్లీల వారీగా సమీక్షలు చేస్తుందని వెల్లడించారు. తీన్మార్ మల్లన్న ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. ఇప్పటివరకు ఎవరితోనూ భూముల విషయంలో కొట్లాటలు లేవని.. భవిష్యత్తులోనూ ఉండవని తేల్చిచెప్పారు.