హైదరాబాద్ : బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లోని కవిత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఎమ్మెల్యే షకీల్కు ఎమ్మెల్సీ కవిత ఈద్ ముబారక్ తెలియజేశారు. అనంతరం బోధన్ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.
అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ప్రతి పండుగకు ప్రభుత్వమే కానుకలు అందజేస్తుందన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.