జగిత్యాల ఫిబ్రవరి 1 :పెన్షనర్లకు(Pensioners) అన్ని విధాలుగా అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం అసోసియేషన్ ముద్రించిన 2024 డైరీలను, క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో కేసీఆర్ వెంట నడిచిన పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీలో 43 శాతం పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, సహాయ ఆధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి, ఉపాధ్యక్షుడు యాకూబ్ పాల్గొన్నారు.