MLA Sanjay Kumar : జగిత్యాల జిల్లా కేంద్రం అభివృద్ధికి, నుకాపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ పూర్తికి నిధులు మంజూరు చేయాలని కేసీఆర్ను జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ కోరారు. ఈరోజు ప్రగతిభవన్లో ఆయన కేసీఆర్ను కలిశారు. డబుల్ బెడ్ రూమ్ల డ్రైనేజీ నిర్మాణం, నీటి వసతి, కరెంట్ సౌకర్యం నిమిత్తం నిధులు మంజూరు చేయాలని ఆయన ముఖ్యమంత్రికి విన్నవించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన గులాబీ గర్జన సభలో నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం రోడ్లు, వివిధ అభివృద్ధి పనుల కోసం కేసీఆర్కు సంజయ్ వినతి పత్రం అందజేశారు. ఆ పనులకు నిధుల మంజూరు చేయాల్సిందిగా కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మేల్యే తెలిపారు.