హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజక్టు పూర్తికాక ముందే భద్రాచలం ప్రాంతంలో తీవ్ర ముం పు సమస్య ఏర్పడుతున్నదని, ఇది పూర్తయితే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం వరదలపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో సండ్ర మాట్లాడుతూ.. పోలవరం వల్ల భద్రాచలంతోపాటు రాముడు ముంపునకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అథారిటీతోపాటు కేంద్ర ప్రభుత్వంపైనే ఉన్నదని స్పష్టంచేశారు. కేంద్రం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం అమలుచేస్తున్న ఫసల్ బీమా యోజన రైతులకు అనుకూలంగా లేదని, రైతులకు న్యాయం జరిగేలా రైతు ఆ ధారిత బీమాను తేవాలని కేంద్రా న్ని కోరారు. వరదలవల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సీఎం కేసీఆర్ దూరదృష్టి ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అసమతుల్యతవల్లే భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయని బీజేపీ సభ్యుడు రఘునందన్రావు పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని చెప్పారు.