హేశ్వరం, డిసెంబర్ 7 : ప్రజలకు జవాబు దారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు ఇన్చార్జి ఎంపీపీ సునిత, మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు రాజునాయక్తో కలిసి ఆమె పాల్గొన్నారు. మహేశ్వరంలో ప్రసిద్ధి గాంచిన శివగంగ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి మొదటి సారి నియోజక వర్గం మహేశ్వరం రావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి నియోజక వర్గం ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. నియోజక వర్గంలో ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల కష్ట సుఖాలల్లో ఉంటామనని హామీనిచ్చారు. యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇక ముందు వచ్చేవి ఎన్నికల కాలమని ప్రతి ఒక్కరు పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆమె సూచించారు. నియోజక వర్గంలో అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికత ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.