MLA Sabitha Indra Reddy | షాబాద్, ఏప్రిల్ 13: పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ సీటును గెలిపించి పార్టీ అధినేత కేసీఆర్కు గిఫ్ట్ట్గా అందిద్దాం. చేవెళ్లలో ఒక సెంటిమెంట్ ఉంది. ఉదయం నుంచి ఎర్రటి ఎండ ఉంది. మీరు (కేసీఆర్) ఇంటి నుంచి బయలుదేరగానే ఇక్కడ మబ్బులు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో కచ్చితంగా చేవెళ్ల గడ్డమీద గులాబీ జెండా ఎగురవేయబోతున్నాం. గ్రేటర్కు దీటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. నేడు అంతటా కనిపిస్తున్న అభివృద్ధికి ఇందుకు నిదర్శనం.
ప్రజల కోరిక మేరకు వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వికారాబాద్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచేసిన మెడికల్ కాలేజీని బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేయడం ప్రజలకు ఎప్పటికీ మరిచిపోరు. బీఆర్ఎస్ను మోసం చేసి ఇతర పార్టీల తరఫున పోటీలో నిలిచిన వారిని పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 93 బీసీ కులాల సంక్షేమం కోసం 40 ఏండ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను చేవెళ్ల నుంచి పార్లమెంట్కు పంపించాలి. బడుగు, బలహీనవర్గాలన్ని ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ ఆశీర్వాదంతో బీసీ బిడ్డ జ్ఞానేశ్వర్ను గెలిపించి పార్లమెంట్కు పంపిద్దాం. బడుగు, బలహీనవర్గాల గొంతుగా వారి సమస్యల పరిష్కరానికి, చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి కాసాని కృషి చేస్తారు.
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన కేసీఆర్కు ధన్యవాదాలు. 45 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న. అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ 93 బీసీ కులాలను గొంతుకగా పనిచేస్తున్న. గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్తు చైర్మన్గా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుదర్ఘీంగా 93 కులాలతో సమావేశం నిర్వహించి మాట్లాడాము. ఆనాడు కొండా లక్ష్మాణ్బాపూజీ ఆదేశానుసారం అందరినీ ఒక వేదికపై తీసుకువచ్చాము. మీ అందరి దయవల్ల ఐదేండ్ల జిల్లా పరిషత్తు చైర్మన్గా పనిచేసిన. ఉపాధ్యాయుల మద్దతు కూడా నాకున్నది. ఎంపీగా కేసీఆర్ అవకాశం కల్పించిన మరుక్షణమే ఉపాధ్యాయులంతా అండగా నిలిచారు. బీసీ కులాలతోపాటు సంచార జాతులను 6 కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చాను. ప్రతి కులంతోని నాకు అనుభవమున్నది. బీసీలకు చీము, నెత్తురు, ధైర్యం ఉంటే కాసానిని చేవెళ్ల గడ్డపై గెలిపించాలని ఒక నాయకుడు సవాల్ విసిరాడు. ఆయనకు చేవెళ్ల గడ్డ నుంచి నేను సవాలు విసురుతున్నాను. తప్పకుండా చేవెళ్ల గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఈ గడ్డ నుంచే మొట్టమొదటి పార్లమెంట్ సీటు కేసీఆర్ బహుమతిగా ఇవ్వబోతున్నాం. సబ్బండవర్ణాలతో నేటి నుంచి కార్యాచరణ ఉంటుంది. మాజీ మంత్రి సబితారెడ్డితోపాటు, ఎమ్మెల్యేలంతా నా వెంటే ఉంటూ, గెలుపుకోసంపాటు పడుతున్నారు. వాళ్లను ఎప్పటికీ మరిచిపోను.