నల్లగొండ : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పీఏపల్లి మండలం అజ్మపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.11.29లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ బడులను బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పీఏపల్లి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.