నాగర్కర్నూల్ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాలు(Government schemes) అందజేస్తామని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లిస్ట్ రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే.. ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్ట్ మాత్రమే ఫైనల్ చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
గ్రామ సభ లిస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన లిస్ట్ మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీపీవోకి ఆదేశాలు జారీ చేసినట్టు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారుల లిస్ట్ బయట పెడితే ఆ గ్రామంలో ఎవ్వరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తా అని బహిరంగంగా హెచ్చరించారు. కాగా, అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాలు
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం
జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ… pic.twitter.com/JBc7COHjek
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025