హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలిస్తున్నారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్పై పలు పోలీసు స్టేషన్లలో వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. అన్ని పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను ఒకే ఎఫ్ఐఆర్గా పోలీసులు నమోదు చేయనున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాజాసింగ్ను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు.
ఇక రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం భావించింది. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని రాజాసింగ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.