హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): శాసనసభలో విద్యుత్తు రంగంపై గురువారం చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ క్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జోక్యం చేసుకొన్నారు.
కొన్నిసార్లు తప్పు చేయకున్నా శిక్ష అనుభవించాల్సి వస్తుందని, బీఆర్ఎస్ ఓటమి ఆ కోవలోకే వస్తుందని చెప్పారు. అంతమాత్రాన పదేపదే దానిని ఎత్తిచూపుతూ విమర్శలకు దిగడం సరికాదని సూచించారు. ప్రజలు మళ్లీ ప్రతిపక్షాన్ని అధికారంలోకి, అధికారపక్షాన్ని ప్రతిపక్షంవైపు కూర్చోబెట్టగలరని పేర్కొన్నారు. సభలో వ్యక్తిగత దూషణలకు దిగకుండా అర్థవంతమైన చర్చ కొనసాగేందుకు అందరూ కృషి చేయాలని ఇరు పక్షాలకు హితవుపలికారు.