హైదరాబాద్ ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రా నేతలు కేంద్రంలోని బీజేపీకి మోకరిల్లారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ ఆర్డర్లు అమలు చేయటం తప్ప ఆంధ్ర ప్రజల బతుకు కోసం ఎప్పుడైనా, ఏమైనా చేశారా? అని నిలదీశారు.
పోలవరం ప్రాజెక్టును కట్టడం చేతకాని ఆంధ్రా నేతలు కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే ఆపలేని దద్దమ్మలని విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు కట్టడం చేతకాని మీరు హరీశ్రావును విమర్శించటం విడ్డూరమని తెలిపారు.