ఆదిలాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉమకు పరువు నష్టం కలిగించేలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాయల్ శరత్ మంగళవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్కు ఫిర్యాదు చేశారు.
ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికగా తమ కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.