కొడంగల్, అక్టోబర్ 25: ‘సీఎం కేసీఆర్తో పోటీ చేయడం నీ తరం కాదు.. ముందు నాపై పోటీ చేసి గెలిచి చూపించు’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసరిరారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనతో పోటీ చేసి గెలిచే చరిష్మా లేదు కానీ.. సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా బుద్ధి రాలేదా? అని విమర్శించారు. కొడంగల్ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ను.. 2018లో ప్రజలు ఎందుకు ఓడించారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. రూ.300 కోట్లతో పీసీసీ పదవిని కొనుక్కొని.. ఇప్పుడు ఎన్నికల సమయంలో సీట్లను అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నట్టు సొంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారని చెప్పారు. రేవంత్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. 2018 నాటి ఫలితమే పునరావృతం అవుతుందని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే కొడంగల్ అభివృద్ధికి నోచుకున్నదని, మంత్రి కేటీఆర్ దత్తతతో వందల కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. నేడు నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు, తండాలకు బీటీ రోడ్లు వేసిన ఘనత కేటీఆర్కే దక్కుతుందని చెప్పారు.