జనగామ: ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు మధ్యవర్తులు లేకుండా అందేలా చూడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ పట్టణ కేంద్రంలోని 22వార్డ్ లో ప్రభుత్వ పట్టణ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు.. ఈ సందర్భంగా స్థానిక పట్టణ నాయకులతో ఎమ్మెల్యే పల్లా కలియ తిరుగుతూ అధికారులతో మాట్లాడి సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ముందుగా నిరుపేదలకు అందేలా చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.