Padma Devender Reddy | సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ప్రైవేటుకు దీటుగా మెరుగైన వైద్యం అందుతుండటంతో అన్ని వర్గాల వారు ప్రభుత్వ దవాఖాన బాటపడుతున్నారు. డెలివరీ మొదలుకొని వ్యాక్సిన్లు, ఇతర ఏ వైద్య సేవలైనా సర్కారు దవాఖాన గడప తొక్కుతున్నారు. కాగా బుధవారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తన మనుమడికి జిల్లా కేంద్రంలోని మాతా, శిశుసంరక్షణ దవాఖానలో టీకా, చుక్కల మందు వేయించారు.
– మెదక్ మున్సిపాలిటీ