తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకి తితిదే ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.
దర్శనం అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.