సిద్దిపేట : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పారిశుధ్య కార్మికురాలికి పాదాభివందనం చేసి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో 6,7,8 తేదీల్లో ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
అందులో భాగంగా చేర్యాలలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను ఎమ్మెల్యే సన్మానించి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యాలను కాపాడటంలో పారిశుధ్య కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు.
కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కూడా వారి ప్రాణాలను ఫణంగా పెట్టి సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. సీఎం కేసీఆర్ మహిళ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తు్న్నారని, అతడికి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు.