బిజినేపల్లి, జూలై 7: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి సమీపంలో నిర్మిస్తున్న మార్కండేయ రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రిజర్వాయర్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఎంజీకేఎల్ఐ కాల్వ పైభాగంలో ఉన్న గ్రామాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో మార్కండేయ ఎత్తిపోతల కోసం సీఎం కేసీఆర్ను ఒప్పించి మంజూరు చేయించామని తెలిపారు. సుమారు రూ.77 కోట్లతో పనులను కొనసాగిస్తున్నట్టు వివరించారు. మమ్మాయిపల్లి, శాయిన్పల్లి, పోలేపల్లి, లట్టుపల్లి, గంగారం గ్రామాలతోపాటు 17 గిరిజన తండాల పరిధిలో 7,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.