నాగర్కర్నూల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రిని ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలో గ్రామగ్రామాన పాదయాత్ర చేస్తున్నానని, ఆలేరులో ప్రసంగిస్తున్న సమయంలో మీడి యా దృష్టిని ఆకర్షించేందుకు ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు అడ్డుతగలారని, దీంతో కాల్చి పారేస్తానని అన్నానని వివరించారు. ఇది తన మాట కాదని ప్రజల గుండెల్లో ఉన్నదేనని చెప్పారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పెద్దపల్లిలో పాదయాత్ర నిర్వహించిన మర్రి జనార్దన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను గ్రామాల్లో పర్యటిస్తూ, చేసిన అభివృద్ధిని చెప్తుంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడ్డుతగులుతున్నారని ప్రశ్నించారు. పేపర్లో పడేందుకు ఇలాంటివి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.