యాదాద్రి భువనగిరి : యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. శుక్రవారం కుటుంబ సమేతంగా ఆలయ శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.
అంతకు ముందు ఆలయ మర్యాదాలతో సంప్రదాయబద్దంగా ఆయనకు స్వాగతం లభించింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని జనార్దన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయనపరిశీలించారు. ఆలయ ఈవో ఎన్ గీత తదితరులు పాల్గొన్నారు.