జవహర్నగర్, డిసెంబర్ 19: ప్రగతే లక్ష్యం, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, బీఆర్ఎస్ తీసుకువచ్చిన కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi) పథకంతో ప్రతి నిరుపేద ఇంట్లో ఆనందం నెలకొందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy )అన్నారు. మంగళవారం జవహర్నగర్ కార్పొరేషన్ తహసీల్దార్ మీటింగ్ హాల్లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ను మరింత అభివృద్ధి చేసి ఉత్తమ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతామని అన్నారు. జవహర్నగర్ నా గుండెకాయలాంటిదని..జవహర్నగర్ ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని తెలిపారు. అనంతరం 20మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీలక్ష్మి, కార్పొరేటర్లు జిట్టా శ్రీవాణి, లావణ్య, సతీష్కుమార్, శారద, పల్లపు రవి, లక్ష్మి, చిత్ర, తదితరులు పాల్గొన్నారు.