హైదరాబాద్, డిసెంబర్ 18, (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేశవాపురంలో గిరిజనుల భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఫిర్యాదు మేరకు శామీర్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు.
ఈ పిటిషన్ జస్టిస్ కే సురేందర్ ఎదుట విచారణకు రావడంతో.. ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేనులను తాను విచారణ చేపట్టబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించే న్యాయమూర్తికి ఎమ్మెల్యే మల్లారెడ్డి పిటిషన్ను నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు.