వెంగళరావునగర్, జూలై 8 : బోనాల పండుగను వైభవంగా నిర్వహించాలని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం వెంగళరావునగర్ డివిజన్ జీటీఎస్ దేవాలయంలో నియోజకవర్గంలోని దేవాలయాల కమిటీ సభ్యులకు బోనాల పండుగ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలను తెలిపే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని..దేవాలయాలకు కావాల్సిన డబ్బలను మంజూరు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ వైభవం ఉట్టిపడేలా బోనాల పండుగను నిర్వహించాలని అన్నారు. బోనాల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా..పండుగను వైభవోపేతంగా నిర్వహించడానికి దేవాలయాల కమిటీ సభ్యులు, అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి,వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేశ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్, సంజీవ, ప్రదీప్, అప్పుఖాన్, కృష్ణమోహన్, సంతోష్, విజయ్కుమార్, తన్నుఖాన్, విజయసింహ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
షేక్పేట్ జూలై 8: ప్రజలకు సీవరేజీలైన్లను ఆధునీకరించడానికి జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. శనివారం షేక్పేట్ ఓయూ కాలనీలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జలమండలి,జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ఓయూ కాలనీలో సీవరేజీ లైన్లను ఆధునీకరించాలని, వర్షం నీరు సక్రమంగా పోయేలా చర్యలు చేపట్టాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ విజయ్కుమార్,ఏఈ మోహన్రావు,జలమండలి డీజీఎం జవహర్ అలీ , బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్, నాయకులు పూస వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కట్టడాలను అడ్డుకోవాలి..
షేక్పేట్ జూలై 8: షేక్పేట్ ఓయూ కాలనీ రోడ్డును ఆక్రమించి అక్రమంగా కట్టడాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు శనివారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు సంక్షేమ సంఘం నాయకులు రవికుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్ వినతి పత్రం అందచేశారు. స్పందించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అక్రమ కట్టడాలను అరికట్టడానికి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.