దుబ్బాక, డిసెంబర్ 13 : గురుకులాలను నిర్వీర్యం చేయడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్సీ బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన సందర్శించారు.
విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చలి తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అద్దె భవనంలో వసతులు లేవని , డార్మటరీ గదులు లేక తరగతి గదిలో నిద్రిస్తున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో 49 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో దుబ్బాక మాజీ జడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ ఉన్నారు.