హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) విరుచుకుపడ్డారు. రేవంత్రెడ్డిది బ్లాక్మెయిలర్ బ్రాండ్ అని ఫైర్ అయ్యారు. ఎంతమంది వ్యాపారులను బెదిరించారో అందరికి తెలుసన్నారు. పీసీసీ పదవిని డబ్బులతో కొన్నాడని దుయ్యబట్టారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రేవంత్ జైలుకెళ్లారా అని ప్రశ్నించారు.
ఆత్మగౌరవం చంపుకుని రేవంత్ కింద పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఏ వ్యాపారం లేకుండా వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీని కించపరిచేలా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. సోనియాను బలిదేవత అన్నది రేవంత్ ఒక్కడేనని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపఎన్నికకు బయపడి ఉత్తుత్తి రాజీనామా చేశాడని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజీనామా చేసి స్పీకర్కు కాకుండా చంద్రబాబుకు ఇచ్చాడని విమర్శించారు. ప్రొఫెసర్ జశంకర్, కోదండరామ్ను తిట్టిన చరిత్ర రేవంత్దన్నారు. సోనియా, వైఎస్సార్ను తిట్టిన వ్యక్తి తన గురించి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. అసలు రేవంత్.. జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసులో డబ్బులతో దొరికిన దొంగ అని విమర్శించారు.
బీజేపీతో కాంట్రాక్ట్ తీసుకున్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కోసమే పార్టీ మారినట్లు నిరూపించాలని, అలా చేయకపోతే పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఒకవేళ నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్ని సవాల్ విసిరారు.