సూర్యాపేట : దళితబంధు పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికంగా దళితులను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం రూపొందించారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తెలిపారు. తిరుమలగిరి పట్టణంలోని నివాసంలో నాగారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన దళితబంధు లబ్ధిదారులతో దళిత బంధు పథకంపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధు కింద మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థిక సహాయం అందజేస్తున్న పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. దళితుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. పది లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో లబ్ధి దారులకు అందజేస్తున్నామని వీటిని దళితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నచ్చిన యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదుగాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.