హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడి సాధించి..భావి తరాలు గుర్తించుకునేలా పాలిస్తున్న నేత సీఎం కేసీఆర్ అని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య(MLA Kale Yadaiah) అన్నారు. సోమవారం షాద్నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివి విధంగా పెన్షన్లు, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. అడగక ముందే సీఎం కేసీఆర్ ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్ నగరానికి సమాంతరంగా చేవెళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు.