హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress party) ఏర్పడినా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అన్నట్లు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో కడియం మాట్లాడుతూ..కాంగ్రెస్కు బొటాబోటి మెజార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కామన్ అని చెప్పినట్లు వివరించారు.
ఏదేమైనా ఇచ్చిన హామీలను అమలు నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, బలమైన ప్రతిపక్షం ఉందని మరోసారి గుర్తు చేశారు. మీరు బాగా పని చేయాల్సి ఉందని మాత్రమే తాను చెప్పానని, కానీ కాంగ్రెస్ నేతలు ఆ వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ వాళ్లే ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నట్లు ఆరోపించారు. వాళ్ల మీద వాళ్లకే నమ్మకం లేదని, అందుకే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.