హైదరబాద్ : హృదయ సంబంధిత అనారోగ్యంతో గచ్చిబౌలిలోని కిమ్స్(Kims) దవాఖానలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(Ummareddy Venkateshwarlu)ను మంగళవారం సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Jagadish Reddy) పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అదే దవాఖానలో చికిత్స పొందుతున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నసీంపేట గ్రామానికి చెందిన గుండపునేని హనుమంతరావును పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.