సూర్యాపేట : బీఆర్ఎస్, బీఆర్ఎస్ను అప్రతిష్ఠపాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని , కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. సోమవారం సూర్యాపేట(Suryapet) నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన( Dry crops,) వరి, మిరప తోటలను రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడూ.. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వచ్చిన కొద్ది నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఎండిపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మిరప రైతులకు రూ.80 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు.