సూర్యాపేట, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెదడు నిండా అజ్ఞానం, మూర్ఖత్వం ఉన్నదని అందుకే రెండున్నరేండ్లలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు ఎక్కడ ఎంత దొరికితే అంత దోపిడీ చేస్తూ.. పదేండ్లలో కేసీఆర్ పచ్చగా మా ర్చిన తెలంగాణను ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజలు.. ప్రధానంగా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అయితే అప్పటి వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం సూర్యాపేట నియోజకవర్గంలోని బీఎల్ఏలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రాగా స్థానిక మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్హాలులో ‘సర్’పై అవగాహన కల్పించా రు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, రాంచంద్రనాయక్, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గోపగాని వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.