హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధాని బహుభాషా వేత్త, ఆర్థిక సంస్కరణల సృష్టికర్త అన్నింటికీ మించి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna) ను ప్రకటించడాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadish reddy) స్వాగతించారు.
ఇది తెలంగాణా ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. కాగా, తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కు అరుదైన గౌరవం దక్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా కేంద్రం భారత రత్న పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించింది. దీంతో పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.