సిద్దిపేట, డిసెంబర్ 7 : బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను(BRS activists) కంటికి రెప్పలా కాపడుకుంటుందని, వారి కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు(MLA Harish Rao) అన్నారు. గురువారం ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 2017 నుంచి 2023 వరకు సభ్యత్వం పొందిన వారిలో 60 మందికి ఇన్సూరెన్స్(,Insurence) ద్వారా రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేశామన్నారు. చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన మెట్ల పర్శరాములు ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందారు.
అదే విధంగా ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన పొన్నాల మల్లేశం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొంది కార్యకర్తలుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా రూ.2 లక్షలు మంజూరు కాగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.