సిద్దిపేట : ప్రజలందరికి యేసుక్రీస్తు దీవెనలు లభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) అన్నారు. క్రిస్మస్(Christmas) పర్వదినం సందర్భంగా సోమవారం సిద్దిపేట(Siddipet)లోని సీఎస్ఐ చర్చి(CSI Church)లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చర్చి ఫాదర్లు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు.
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులు ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. సిద్దిపేటలో క్రిస్టియన్ భవనం నిర్మించుకున్నామని తెలిపారు. ఇరవై మూడు ఏండ్లుగా క్రమం తప్పకుండా ఇదే చర్చిలో మీ మధ్యనే ప్రార్థనలు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఏ సమస్యలు ఉన్నా మీకు ఓ అన్నాలా, ఓ తమ్ముడిలా అండగా ఉంటాటనని హామీనిచ్చారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.