మెహిదీపట్నం ఫిబ్రవరి 4: రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగని రోజు నిద్రాహారాలు మాని తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ప్రభుత్వంతో పోరాడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లంగర్హౌస్ రింగ్రోడ్లోని కిన్నెర గార్డెన్ హోటల్లో ఆదివారం తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్స్ నూతన అసోసియేషన్ ఆవిర్భావ కార్యక్రమంతోపాటు, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసినందుకు హరీశ్రావుకు కృతజ్ఞత కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని, అయినా ప్రజల్లో అసంతృప్తి ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి విశేష కృషి చేశామని తెలిపారు.
పాలిటెక్నిక్ కశాశాలల లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. అనంతరం తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ల అసోసియేషన్ నూతన క్యాలెండర్ను హరీశ్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమాశంకర్, ప్రధాన కార్యదర్శి అస్మతుల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ ఇమాన్యుయెల్తోపాటు వివిధ జిల్లాల అధ్యక్షులు నాగరాజ్, రాజేశ్వర్, శ్రీకాంత్, ప్రవీణ్, కృష్ణ, ఎండీ రియాజ్, రాజశేఖర్, మల్లయ్య, దశరథ్నాయక్, రాంబాబు, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు కనకచంద్రం, రాధిక, మాలతి తదితరులు పాల్గొన్నారు.