Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీనే జీతాలిస్తే.. గురుకులాల్లో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు ఎందుకు అందడం లేదని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదని హరీశ్రావు ధ్వజమెత్తారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని హరీశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న ICT కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో వారు అప్పుల పాలై అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నది. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న ICT కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు అందడం…
— Harish Rao Thanneeru (@BRSHarish) April 20, 2024