Harish Rao | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై సీఎం రేవంత్రెడ్డి తీరు బీజేపీకి బీ-టీమ్ లీడర్లా ఉన్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రా వు ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ తీరుకు వ్యతిరేకంగా ఉన్నదని విమర్శించారు. రేవంత్ తీరు కాంగ్రెస్కు రాష్ట్ర ప్రతినిధిగా ఏ కోశాన కనిపించటం లేదని, బీజేపీ, మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు మరోసారి తేటతెల్లమైందని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఆయన ఆరెస్సెస్ భావజాలం ఉన్న బీజేపీ, మోదీ మనిషి అని మొదట్నుంచీ చెప్తున్నామని అన్నారు. తాను కాం గ్రెస్లో ఉన్న విషయాన్నీ మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
మద్యం పాలసీ విషయంలో ఇన్నేండ్లు తాము ఏం చెప్తున్నామో.. ఖర్గే, రాహుల్గాంధీ అదే చెప్పారని హరీశ్ తెలిపారు. తమ వాదనను ఏఐసీసీ కూడా బలపరిచిందని, లికర్ సామ్ అనేది కల్పితమని స్పష్టంచేశారు. కేంద్రం రాజకీయ ప్ర త్యర్థులపై తప్పుడు కేసులు పెట్టిస్తుందని మండిపడ్డారు. ఏఐసీసీ మాట్లాడినదానికి విరుద్ధంగా రేవంత్ మాట్లాడుతున్నారని, లిక్కర్ పాలసీలో స్కాం జరిగిందని, నిందితుల అరెస్టు ఆలస్యమైందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, బీజేపీ తరఫున వకాల్తా పుచ్చకొని బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు సీఎం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.