అచ్చంపేట రూరల్, డిసెంబర్ 29: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పీహెచ్డీ పట్టా పొందారు. పూర్తిస్థాయిలో ప్రజా సేవ చేస్తూనే మరోపక్క ఆసక్తి ఉన్న న్యాయరంగాన్ని ఎంచుకొని అందులోనూ రాణించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యలో పీహెచ్డీ పూర్తి చేసి శెభాష్ అనిపించుకున్నారు. న్యాయ విభాగం ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పీహెచ్డీ పూర్తి చేసుకొని గురువారం సతీమణి అమల, కొడుకుతో కలసి పట్టా పొందారు. గువ్వల మాట్లాడుతూ.. వలస కూలీ బిడ్డకు అందిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు.