BRS Party | కరీంనగర్ : వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే.. బీసీ కదన భేరి సభను వాయిదా వేస్తున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. ప్రస్తుతం సభ నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయని, అయితే.. వాతావారణ శాఖ చెప్పిన అంశాలను పరిగనణలోకి తీసుకొని వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈనెల 14, 15, 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు చేసిన హెచ్చరికల మేరకు.. బీసీ కదన భేరి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. భేరి ఎప్పుడు నిర్వహించే విషయాన్ని.. తదుపరి ప్రకటిస్తామని, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని ఆ ప్రకటనలో కోరారు.