జయశంకర్ భూపాపల్లి : టికెట్లను అంగట్లో అమ్ముకున్నోడు, నోట్ల కట్టలతో దొరికినోడి మాటలు నమ్మితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు అని భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి(MLA Gandra )పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం భూపాపల్లిలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్లో ఒక లీడర్ 3 గంటల కరెంట్ అంటాడు. మరొకరు 5 గంటలు ఇస్తం అంటాడు. బీఆర్ఎస్ ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నది. ఏదో కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
ఆన్ గోయింగ్ పథకం రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాసి ఆపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ గారడి మాటలు నమ్మితే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏవీ ఉండవన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారిని నిన్న కలిశాను. ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి వస్తాను అని చెప్పాడన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భూపాలపల్లిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.