ఎల్బీనగర్లో జీవో -118 కింద కన్వేయన్స్ డీడ్ (పట్టాలివ్వడం) ఆపేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆరోపించారు. ఈ జీవో కింద మన్సూరాబాద్, కర్మాన్ఘాట్ ప్రాంతాల్లో సగం మందికి పట్టాలిచ్చారని, మరో సగం మందికి పెండింగ్లో పెట్టారని అసెంబ్లీలో ప్రస్తావించారు.
ఎన్నికలు రావడంతో పట్టాలివ్వడం ఆపేశారని, ప్రభుత్వం మారితే పట్టాలివ్వడం ఆపేస్తారా? అని ప్రశ్నించారు.