పెద్దపల్లి : పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి నుంచి పెద్దపల్లి వరకు డబుల్ రోడ్డు(Double Road) నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి(Mla Manohar Reddy) విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్(CM KCR) రూ.19.80 కోట్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిధులు మంజూరు పట్ల సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. నిధుల మంజూరుతో నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ నెరవేరిందని ఆయన అన్నారు.
డబుల్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బుధవారం కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు ఉన్నారు.