నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం జరిగింది. ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నార్కట్పల్లి కామినేని దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల కిందట ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలిసింది. దీంతో వైద్యులు మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నర్సింహా తుది శ్వాస విడిచారు.
తండ్రి మరణంతో ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి నకిరేకల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్న ఎమ్మెల్యే చిరుమర్తి హుటాహుటిన తరలివచ్చారు. నర్సింహా మృతదేహానికి రేపు ఉదయం స్వగ్రామం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్లంలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.