నల్లగొండ : మిర్యాలగూడ పట్టణములోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS ) లో శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్రావు (Mla Bhasker Rao) సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్(CM KCR) అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
మైనారిటీలకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ప్రభుత్వం చేబడుతున్న కార్యక్రమాలకు ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు, నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని వెల్లడించారు. పార్టీలో చేరిన వారిలో సామజిక వేత్త రియాజ్ , ఎండీ ముబీన్, బషీర్, రిజ్వాన్, సల్మాన్ ఖాన్, సయ్యద్ నసీర్, యాసీన్, గౌస్, ముజ్జు, ఇమ్రాన్, యూసుఫ్, రఫ్లు, ఇస్మాయిల్, సోఫిన్, నాగుల్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యువనేత నల్లమోతు సిద్దార్ధ, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు బంటు రమేశ్, ఇలియాస్, వజ్రం, వడ్డేపల్లి శ్రీను, బారెడ్డి అశోక్ రెడ్డి, బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర కార్యదర్శి యం.డి షోయబ్, గయజ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.