నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(MLA Bajireddy Govardhan) అన్నారు. గురువారం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం సహకారంతో నియోజకర్గంలో రామడుగు ప్రాజెక్ట్ , రెండు మండలాల ఏర్పాటు చేసుకున్నాం.
దర్పపల్లిలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని, అక్కడే నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. డిచ్పల్లిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ యూనివర్సిటీ ఉది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎంతోమంది గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చారు మిగిలిన మరికొందరికి కూడా ఇవ్వాలన్నారు.
ఇక్కడ పంటలు బాగా పండుతున్నాయి. కావున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఇక్కడి యువతకు ఉపాధి దొరుకుతుంది. జక్రాన్పల్లి మండలంలో విమానాశ్రయం(Airport) కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ప్రజల కలను నిజం చేయాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. అలాగే గుండారం మండలం ఏర్పాటుతో పాటు నిజామాబాద్ రూరల్కు గృహలక్ష్మి కింద పదివేల ఇండ్లు కేటాయించాలన్నారు.