వరంగల్ : ఢిల్లీకి గులాం అవుదామా? గల్లీలో అభివృద్ధి చేసుకుందూమా అనేది వర్ధన్నపేట నియోజకర్గ ప్రజానీకం ఆలోచించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్(MLA Aruri Ramesh )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండలం వడ్లకొండ, రోళ్లకల్, నారాయణపురం, సోమారం, జమాలపరం, గోరుగుట్ట తండా, చౌటపల్లి, హట్యతండా, దౌలత్ నగర్, సీకే తండా, ఇస్లవాత్ తండాల్లో గడగడప ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు పెద్దఎత్తున రమేష్ కి డప్పు చప్పులు, కోలాటాలు, బతుకమ్మలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొత్త కొత్త వేషాలతో కొంత మంది మీ ముందుకు వస్తున్నారు. వారి మాటలు నమ్మి మోస పోవద్దన్నారు. నమ్మి పోసపోతే ఆ తర్వాత గోస పడుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, గులాబీ జెండానే మనకు అండగా ఉంటుందన్నారు. కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలన్నారు.