వికారాబాద్ : వికారాబాద్ బీఆర్ఎస్ గర్నమెంట్ రాకముందు ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉండేదో ఆలోచించాలి. సీఎం కేసీఆర్ వికారాబాద్ను జిల్లా చేసి అరవై ఏండ్ల కలను నెరవేర్చారని వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్(MLA Anand ) అన్నారు. గురువారం వికారాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్లో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసిన ఘతన సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
అంతేకాకుండా మెడికల్ కాలేజీ, ఆయుష్ హాస్పిటల్, యాభై పడకల దవాఖానను ఏర్పాటు చేశారన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం 90 కోట్లు కేటాయించి ప్రయాణికుల కష్టాలు తీర్చారన్నారు. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా వికారాబాద్ చుట్టూ రింగు రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతో పాటు మోమిన్ పేటలో మైనార్టీ జూనియర్ కాలేజీ, ఏర్పాటు చేయాలన్నారు.