మహబూబ్నగర్ : తెలంగాణలో సంక్షేమ ఫలాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికి చేరుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే..దేవరకద్ర కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, దేవరకద్ర గ్రామ ఉప సర్పంచ్ రాందాస్ కుమారుడు వినీత్ కుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రూ. 8 లక్షలు మంజూరు చేయించారు. బుధవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రాందాస్ ఇంటికి నేరుగా వెళ్లి రూ. 8,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.
ఇది తెలంగాణ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని, పార్టీలు తమకు ముఖ్యం కాదని, అందరికీ అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు.