Heroin Seized | మిజోరాంలో అసోం రైఫిల్స్ ఘన విజయం సాధించింది. రూ.18కోట్లకుపైగా విలువైన హెరాయిన్, రూ.1.21 కోట్ల విలువైన లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నది. ఐదుగురు మయన్మార్ జాతీయులను సైతం చంపై జిల్లాలో అరెస్టు చేశారు. సమాచారం మేరకు అసోం రైఫిల్స్, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందాలు మిజోరాం-మయన్మార్ సరిహద్దులోని జోట్, జోఖౌతార్ గ్రామాల్లో ఆపరేషన్ ప్రారంభించాయని అధికారులు శనివారం తెలిపారు. ఈ క్రమంలో 2.61 గ్రాముల మత్తును స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న హెరాయిన్ మార్కెట్ విలువ రూ.18.30 కోట్లు ఉంటుందని అసోయం రైఫిల్స్ అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో లెక్కలో చూపని నగదు భారతీయ కరెన్సీని గుర్తించింది. పట్టుబడిన నగదు రూ.500, రూ.200, రూ.100, రూ.50 నోట్ల స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకోవడం పాటు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను చట్టపరమైన చర్యల కోసం చంపై పోలీసులకు అప్పగించినట్లు అసోం రైఫిల్స్ అధికారి చెప్పారు. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి మంగళవారం ఓటింగ్ జరిగిన మూడు రోజుల తర్వాత ప్రచారం ప్రారంభమైంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.